విజయవాడ నగరంలో కనక దుర్గ అమ్మవారు రాత్రిపూట సంచరిస్తుందట..!

 ఏషియన్ మీడియా నెట్వర్క్

విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట అమ్మ కొంగు బంగారం లా నిలబడేది.. అక్కడ అమ్మవారు చేసిన మహిమలు కోకొల్లలు..



కనకదుర్గమ్మ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి ఆ తల్లి కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది..

ఢిల్లీ వెంకన్న రిక్షాలో కనక దుర్గ మాత

విజయవాడ లో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారి భక్తుడు.. కాయ కష్టం మీదే బతికేవాడు..

అది 1955వ సంవత్సరంఅప్పట్లో రోజులు మారాయి  సినిమా విడుదల అయ్యింది.. ఢిల్లీ వెంకన్న రిక్షా కార్మికుడు కాబట్టి సినిమాహాల్ దగ్గర ఉండేవాడు సినిమా అయిపోయిన తర్వాత రిక్షాలో వెళ్లాలనుకునే వారికి అతను అందుబాటులో ఉండే వాడు


వారు కోరుకున్న ప్రాంతానికి రిక్షాలో తీసుకెళ్లేవాడు ఒక రోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతీ టాకీస్ సినిమాహాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండీ ఒక మహిళ ఎర్రటి చీర నుదుటున పెద్ద బొట్టు తో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది..



అక్కడ నుండి ఆయన రిక్షా లో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయమైంది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా నీకు భయమేయట్లేదా అంటే దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న అమ్మ అ కనక దుర్గమ్మ మా ఇలవేల్పు ఆమె మా తల్లి తల్లిని చూస్తే ఎవరికైనా భయమైతుంది అమ్మ . మమ్మల్ని చల్లగా చూసి మా తల్లి దగ్గర బిడ్డలకి భయమెందుకు అంటాడు..



కొంత దూరం వెళ్లగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలి అమ్మ అని అడుగుతాడు  వెనక నుండి సమాదానం లేదు అదేంటీ అని వెనక్కి తిరిగి చూడగా  ఉండదు రిక్షాలో అదేంటీ అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది


అదేంటీ అమ్మ డబ్బులు ఇవ్వలేదు అనగా నీ తలపాగా లో పెట్టాను చూడు అంటుంది.. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు ఒక పక్క, పదిరూపాయల నోటు మరో పక్క ఉన్నాయి.వెంటనే ఆయనకి అర్ధమవుతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్నఅమ్మ అని..



దాంతో ఒక్కసారిగా ఆనందంతో అమ్మ నా జన్మ ధన్యమైంది లోకాలను పాలించే నువ్వేనా రిక్షా ఎక్కడం ఏమిటి తల్లి నేనెంత అదృష్టవంతుడిని అంటూ బిగ్గరగా అరవడం మొదలు పెట్టాడు మొదలెడతాడు.. చుట్టు పక్కల ఉన్న వాళ్ళు అందరు పరుగు పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడుగగా వారికీ జరిగింది చెప్తాడు


అయితే బ్రాహ్మణ వీధిలో  ఉన్న అమ్మవారి ఉపాసకులకి వచ్చింది అమ్మవారే అని అర్ధమవుతుంది... అప్పటి నుండి ఇప్పటి దాకా చాలా మందికి రాత్రి పూట గజ్జెల సవ్వడి వినబడుతూనే ఉంటుంది అది సాక్షాత్తు అమ్మవారు దేనని ఆ ప్రాంత ప్రజలు విశ్వసిస్తుంటారు

అమ్మవారి మహత్యాలు ఇలా ఎన్నెన్నో విజయవాడలో ఎంతో మందికి అమ్మవారిని దర్శించుకున్న సంఘటనలు కోకొల్లలు


ఈ సంఘటన 1955వ సంవత్సరంలో ఆంధ్రకేసరి పత్రికలో  ఫోటోతో సహా వేశారు..

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్