ఆర్ఎస్ఎస్ చీఫ్ ను అవమానించిన వ్యక్తికి భారతీయ జనతా పార్టీ జాతీయ యువమోర్చా లో కీలక పదవి

 బిజెపిలో పైరవీలకు పదవులు  ..'భారతమాత" ను అవమానించిన వారికి జాతీయ పదవులు

... బిజెపిలో లోపించిన క్రమశిక్షణ 

.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘ్ పరివార్

By: K.AshokReddy,
Senior Journalist, 
Hyderabad.


 ఏఆర్ మీడియా/ ఏసియన్ మీడియా,

 హైదరాబాద్:జులై18


 క్రమశిక్షణకు మారు పేరైన బిజెపి లో పైరవీలకు ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తూ పదవుల పందేరం చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉంటూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచామని  గొప్పలు చెప్పుకున్న బిజెపి సైతం, పైరవీలతో పదవులను కొనుగోలు చేస్తున్నారు.


పైగా బిజెపికి మాతృక, మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మార్గదర్శకాలతో పార్టీ క్రమశిక్షణతో దినదినాభివృద్ధి చెందింది. 1980 లో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ,  నేడు, దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగింది. ఎంతో క్రమశిక్షణతో నేతలను ఎంపిక చేసుకొని పార్టీలో చేర్చుకుంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ప్రజాభిమానాన్ని చురగొంటు విజయపరంపరను సాధిస్తూ వస్తోంది. ఇలాంటి తరుణంలో తెలంగాణలో 'జంపింగ్ జపాంగ్" లను తీసుకుని పదవులు కట్టబెట్టడం వాళ్ల పార్టీ పరువు బజారున పడుతోంది.

ఈ జంపింగ్ జపాంగ్ లు, గతంలో వారు పనిచేసిన కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలలో ఉండి "భారతమాత" చిత్రపటానికి ఘోరమైన అవమానం చేసి కాల్చివేసిన వారికి జాతీయ పదవులు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆయన పనితీరును తీవ్రపదజాలంతో తూలనాడిన వారికి వారికి జాతీయ స్థాయి యువ మోర్చా పదవి ఇవ్వడం యావత్ సంఘపరివార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

తెలంగాణ ప్రాంతంలో సంఘ్ పరివార్ అన్ని రాజకీయ పార్టీలను ఎదుర్కొంటూ హిందూ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెబుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. 


"టీం సాయి" కి పదవిపై సర్వత్రా నిరసన:

 


పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి పదవులు ఇవ్వడం బిజెపిలో కొత్త ఆనవాయితీ అలవాటు చేసుకున్నట్లు అర్థమవుతుంది. పార్టీ కొరకు త్యాగం చేసే వారిని అణచివేత చర్యలకు పాల్పడుతూ తొక్కేస్తున్నారని, పార్టీలోని యువ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, బిజెపి మూల సిద్ధాంతాలు తెలియని వారిని అందలం ఎక్కించటం సరైంది కాదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సాయి ప్రసాద్ (టీమ్ సాయి) అనే వ్యక్తి

కాంగ్రెస్ లో ఉండి ఆర్ ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, భారత మాత దిష్టిబొమ్మలు తగులబెట్టి తీవ్రంగా అవమానించారని పార్టీలోని సంఘ్ పరివార్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, పార్టీ యువ మోర్చా లోని నేతలు ఆరోపించారు.


అనంతరం సదరు వ్యక్తి టిఆర్ఎస్ లో చేరి, అక్కడ కూడా, బిజెపి, దాని మూల సిద్ధాంతకర్త లైన మహానేతను అవమానపరిచే విధంగా వ్యవహరించారని ధ్వజ మెత్తారు. అలాంటి వ్యక్తి బిజెపిలో చేరి, ఆ పార్టీ, జెండా తగల పెట్టినందుకు బీజేవైఎం  కమిటీలో కోశాధికారిగా పదవి ఇవ్వటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

రానున్న రోజుల్లో ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీకి భారీగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. పార్టీ కోసం పని చేసే నాయకులు, ఇలాంటి వ్యవహారాల వల్ల, పార్టీని వీడే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇందులో భాగంగానే యువ నేత అయిన తుళ్ళ వీరేందర్ గౌడ్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు జాతీయ బీజేవైఎం లో కోశాధికారిగా పదవి దక్కుతుందనే ఆశతో ఉన్న వీరేందర్ గౌడ్ తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనై పార్టీ మారేందుకు తన అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ సంఘ్ పెద్దల తో సహ పార్టీ కార్యకర్తలంతా "టీం సాయి" కి పదవిని ఇవ్వడం తో రగిలిపోతున్నారు.  ఇకనైనా బిజెపి రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు పదవుల పందేరం చేసేటప్పుడు ఆ వ్యక్తి, గుణగణాలు, గత చరిత్ర వంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Comments

  1. ఏనుగు పోతుంటే కుక్కలు మొరగడం సహజం. అన్నిటికీ స్పందించుకుంటూ కూర్చోలేము. నిన్నమొన్న పార్టీ లో చేరిన అనేక మందికి పదువులు ఇచ్చారు, మరి వారందరి గురించి ఎందుకు మాట్లాడడం లేదు. 30 సంవత్సరాలు గా పార్టీ లో ఉంటూ పార్టీ కి, సమాజం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మాలాంటి వారికి పదవులు రాకుండా కులవివక్షత చూపుతూ, తన అనుచరులకు మాత్రమే పదువులు కట్టబెడుతున్న వారిని, డబ్బులకు పార్టీ టికెట్ లు అమ్ముతున్న వారి గురించి వీరు ఎందుకు విమర్శలు చేయడం లేదు. వారికి పదవులు ఇవ్వకుంటే ఇంత గగ్గోలు పెడుతున్న వారు. మా విషయం లో పార్టీ లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని, లేక పోతే పార్టీ ఎలా బలం పెంచుకుంటుందని అంటారు ఎందుకు? వారికి ఒక న్యాయం ఇంకొకరికి ఉంకొ న్యాయం ఎలా ఉంటుంది. ఇదంతా భాను ఆడిస్తున్న నాటకం.

    ReplyDelete
  2. Dabbulu pedithey bjp lo padavali pairavi chese vallaki pedda peeta

    ReplyDelete
  3. సాయి కష్టపడే వ్యక్తి మంచి వ్యక్తిత్వం అటువంటి వ్యక్తికి పార్టీ పదవులు ఇవ్వడం వల్ల పార్టీకి మంచి పేరు తెచ్చి పెడతాడు

    ReplyDelete
  4. Anthakante ekkuva mandi unnaru kastapadevallu.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్