థర్డ్‌ వేవ్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

 ఏషియన్ మీడియా నెట్వర్క్ 
హైదరాబాద్‌: జూన్ 18


కరోనా థర్డ్‌ వేవ్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని అనవసరంగా ప్రజలను భయపెట్టొద్దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 

దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్లో కోవిడ్ రోగులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 200 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు భారత్‌లో తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. 


 ఇ  బయోటెక్‌కు వ్యాక్సిన్‌ అడ్వాన్స్‌ కింద రూ.1500 కోట్లు కేటాయించామని తెలిపారు. దేశంలో ఆక్సిజన్‌ కొరతను 15 రోజుల్లోనే అధిగమించామన్నారు. 
తెలంగాణలో 46 ఆస్పత్రులకు 1400 వెంటిలేటర్లు ఇచ్చామన్నారు. 


దీపావళికి 80 కోట్ల మందికి అదనంగా 5 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్టు కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్