Posts

పిసిసి అధ్యక్షుడిగా పొలిటికల్ రెబల్ స్టార్

Image
  పిసిసి అధ్యక్షుడిగా రేవంత్... ....కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా వల్లనే ఎంపిక ఏఆర్ మీడియా/ ఏషియన్ మీడియా  హైదరాబాద్ :  జూన్ 22 తెలంగాణ కాంగ్రెస్ కొత్త రథసారథి ఎంపిక ఫైనల్ అయ్యింది. తెలంగాణలో బలమైన క్యాడర్ ఉండి, తెలంగాణ ఇచ్చిన  పార్టీగా కూడా గుర్తింపు ఉన్నప్పటికీ ఎన్నికల పోరులో వెనుకబడుతున్న కాంగ్రెస్ ను తిరిగి గాడిన పెట్టగల నాయకుడిగా రేవంత్ రెడ్డి వైపు మొగ్గుచూపింది. రెండు సంవత్సరాలుగా జరుగుతున్న తర్జనభర్జనకు ముగింపు పలుకుతూ కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎంపీ రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసింది .పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ఖరారు చేయటంతో పాటు ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనుంది. సామాజిక వర్గాల సమతుల్యతతో పాటు పార్టీకి విధేయులుగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, కొండా సురేఖ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీలను ఎంపిక చేసింది.సీఎం కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనే వ్యక్తే ఇప్పుడున్న సమయంలో నాయకుడిగా ఉండాలన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి పేరును ఖారారు చేసినట్లు తె

మద్యం మత్తులో ఢీ* *ఇంట్లోకి దూసుకెళ్లిన కార్లు*

Image
 * ఏషియన్ మీడియా నెట్వర్క్  చిత్తూరు జిల్లా మాచారెడ్డి: జూన్ 21  ఆగి ఉన్న రెండు కార్లను మరో కారులో వస్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఢీ కొట్టారు.దీంతో సమీపంలోని ఇంటి ప్రహరీ గోడను ఢీ కొడుతూ కార్లు ఇంట్లోకి దూసుకెళ్లాయి. ఇందులో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ఘన్‌పూర్‌ బస్టాండ్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం........ రెండు కార్లను రోడ్డు పక్కన నిలిపి మాట్లాడుకుంటూ నిల్చొన్న ముగ్గురి పైకి మాచారెడ్డి వైపు నుంచి వస్తున్న మరో కారు వచ్చి అమాంతం ఢీ కొట్టడంతో దగ్గరలో ఉన్న ఇంట్లోకి చొచ్చుకుపోయాయి. ఇందులో కాకులగుట్ట తండా సర్పంచి హెమ్ల నాయక్‌, ఉపసర్పంచి నరేశ్‌, గజ్యానాయక్‌ తండాకు చెందిన ఎల్లాగౌడ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కామారెడ్డిలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు.

సుప్రీం కోర్టు ఆదేశాలతో 21 రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు!*

Image
 * ఏషియన్ మీడియా నెట్వర్క్  న్యూఢిల్లీ జూన్ 21 రోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. పరీక్షలు జరగాల్సిన మార్చి, ఏప్రిల్ నెలల్లో దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. దీంతో చాలా రాష్ట్రాలు పరీక్షల నిర్వహణకు వెనకడుగు వేశాయి. 10, ఇంటర్ పరీక్షలను రద్దు చేసినట్లు ప్రకటించాయి. అయితే దేశంలో నాలుగు రాష్ట్రాలు 10, ఇంటర్ పరీక్షలు రద్దు చేయలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల బోర్డు పరీక్షల వ్యవహారంపై సుప్రీం కోర్టు జూన్ 17వ తేదీన పరీక్షలు రద్దు చేయని పంజాబ్, అస్సాం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నోటీసులుజారీచేసింది.ఇకఈవ్యవహారంపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది.  12వ తరగతి పరీక్షల విషయంలో 28 రాష్ట్రాల్లో, 18 రాష్ట్రాలు రద్దు చేశాయి.6 రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించగా, 4 రాష్ట్రాలు రద్దు చేయలేదు. కేరళ 11 తరగతి పరీక్షలు రద్దు చేయకపోవడంతో ఆ రాష్ట్రానికి కూడా సుప్రీంకోర్టునోటీసులు పంపింది.ఇక పరీక్షల అంశంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. *అయితే తాజాగా అస్సాం, పంజాబ్‌, త్రిపుర రాష్ట్రాలు కూడా పరీక్షలు రద్దు చేస్తామని తెలిపాయి. ఇక మిగిలింది ఆంధ్ర ప్రదేశ

ట్రబుల్ షూటర్ వలలో ఈటెల అనుచరులు

Image
  టిఆర్ఎస్ లోకి సమ్మిరెడ్డి  . మరో 20 మందికి   తాయిలాలు  .రంగంలోకి ట్రబుల్ షూటర్  దుబ్బాక ఫెయిల్యూర్ ని హుజరాబాద్ లో రాబట్టేందుకు యత్నం  ...   ... మామ మెప్పు కోసం తాపత్రయం By: K. Ashok Reddy, Senior Journalist. Hyderabad.  ఏ ఆర్ మీడియా /ఏసియన్ మీడియా  హైదరాబాద్:  జూన్ 20,   హుజూరాబాద్ నియోజకవర్గం లో బేరసారాలకు తెర లేచింది. ఈటల అనుచరులపై ప్రత్యేక దృష్టి సారించి, వారందరినీ, టిఆర్ఎస్ లో  చేర్చేందుకు రంగం సిద్ధమైంది.  ఇప్పటికే ఈటల కు ప్రధాన అనుచరుడిగా ఉన్న జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి కి గాలం  వేశారు. సమ్మిరెడ్డి  తో పాటు మరో 20 మంది ఈటల ప్రధాన అనుచరులకు ట్రబుల్ షూటర్ నుంచి వర్తమానం అందినట్లు సమాచారం. వీరు కూడా త్వరలోనే ఈటలను విడిచి టిఆర్ఎస్ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకుగాను సదరు నేతలకు రాజకీయ భవిష్యత్తు తో పాటు, ఆర్థిక పరిపుష్టి ఉంటుందని భరోసా ఇస్తున్నట్లు సమాచారం. ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన మంత్రి హరీష్ రావు హుజరాబాద్ నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగానే హుజరాబాద్ లో ఈటల వర్గాన్న

... కె సిఆర్ ఖబర్దార్...!.నీ భరతం పడుతాం ..

Image
  పేలుతున్న ఈటల మాటల తూటాలు  ...కేంద్రం అండతో పెంచిన వాయిస్  ...ఎలక్షన్ కమిషన్ కేంద్రం చేతిలోనే  ..హుజురాబాద్ లో  ఆటలు సాగవు .. మీ భరతం పడతాం: ఈటల హెచ్చరికలు  ఏఆర్ మీడియా /ఏసీయన్ మీడియా  By: K. Ashok reddy. Sr. Journalist,  హైదరాబాద్ జూన్ 19   ఇన్నాళ్లు కొంత మెతక వైఖరి అవలంబిస్తూ వస్తున్న ఈటల రాజేందర్ గత రెండు రోజుల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గం లో నిర్వహిస్తున్న పలు సభలు, సమావేశాల్లోతెలంగాణప్రభుత్వం పై మాటల తూటాలను పేల్చుతున్నారు. సమరానికి సై అంటూ, మీ భరతం పట్టే రోజులు దగ్గరపడ్డాయని తీవ్రమైన హెచ్చరికలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల నుంచి వివిధ రకాల పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో నుంచే తిరిగి వారికి సంక్షేమ పథకాల పేరిట ప్రభుత్వాలు డబ్బులు చెల్లిస్తాయని, వీటిని, ఎవరికీ ఆపే దమ్ము ధైర్యం లేదని ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు డబ్బుల మూటలతో హుజూరాబాద్ నియోజకవర్గంలోతిరుగుతూఎరవేస్తున్నారని ధ్వజ మెత్తారు. మీ డబ్బుల సంచులు హుజురాబాద్ లో పనిచేయవని "ఆత్మ గౌరవ నినాదం" పై ఇలాంటి చిల్లరపనులు సరితూగవని హెచ్చరించారు. ఏనాడు హుజురాబాద్ ముఖం చూడని మంత్రులు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో తెప్పోత్సవాలు ప్రారంభం

Image
    ఏషియన్ న మీడియా నెట్వర్క్  తిరుపతి జూన్ 19:  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల‌ పాటు ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా తెప్పోత్స‌వాలు నిర్వ‌హిస్తారు.  కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవమూర్తులకు ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తున్నారు.   ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో రుక్మిణి స‌త్య‌భావ స‌మేత  శ్రీ కృష్ణస్వామివారికి  పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంద్ర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. జూన్ 21న శ్రీ సుందరరాజస్వామివారికి, జూన్ 22 నుండి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో  ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీమ‌తి మ‌ల్లీశ్వ‌రి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Telangana government to modernize the existing vegetable market in Kothapet

Image
 Asian Media Network A.Vijayendar Reddy Correspondent Hyderabad  June19,   The State Cabinet has ratified the decision taken by government to modernize the existing vegetable market in Kothapet and convert into an integrated Veg and Non-Veg market .   The Cabinet has sanctioned the construction of three more super speciality hospitals under the GHMC jurisdiction and to modernize the TIMS as a super speciality hospital keeping in view the needs of people. Among the three new Super speciality hospitals, one would be on the campus of Government Chest Hospital, the second one at the fruit market premises at Gaddi Annaram area where the fruit market is shifted and the third one in  Medchel Malkajgiri district between Alwal  and the ORR. In all the Cabinet has decided to set up four super speciality hospitals including the TIMS. The Agriculture department officials informed the Cabinet that the Paddy yield last year was more than 3 Crore tonnes. So far this season, till this month the rain

The Telangana State Cabinet has decided to lift the lockdown totally in the State

Image
 Asian Media Network A.Vijayender Reddy Spl Correspondent Hyderabad June 19 The State Cabinet has decided to lift the lockdown totally in the State. The Cabinet has examined the reports submitted by the Medical and Health department officials that Corona cases and number and the positive cases have drastically come down and the Corona is now under control in the State. Hence the Cabinet has arrived at the decision to lift the lockdown. The Cabinet has instructed officials from all the departments to lift all the restrictions imposed during the lockdown in the State. The State cabinet also examined that the Corona is coming under control in the neighbouring States also. Based on the reports submitted by the officials, the Cabinet came to the conclusion that compared to other States, Corona came under control speedily in the Telangana State. Based on this, the State Cabinet has decided to lift the lockdown from June 20, the lockdown was imposed till June 19,.   The Cabinet has instructed

వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించి సీజనల్ వ్యాధుల నుండి రక్షణ పొందాలి ....... జిల్లా వైద్య ఆరొగ్య శాఖాధికారి డాక్టర్ హరీష్ రాజ్.

Image
  ఏషియన్ మీడియా నెట్వర్క్ మహబూబాబాద్, జూన్ 19 : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జిల్లా వైద్య, ఆరొగ్య శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టిందని జిల్లా వైద్య, ఆరొగ్య శాఖాధికారి డాక్టర్ హరీష్ రాజ్ తెలిపారు.   శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, వర్షాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులు మలేరియ, డెంగ్యూ, చికెన్ గున్యా, బోధకాలు, మెదడువ్యాపు వ్యాధులు రాకుండా నివారణ చర్యలు చేపట్టుటకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.  సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ వి.పి. గౌతం అధ్యక్షతన ఈ నెల 14న జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి  అన్ని శాఖలను సమన్వయపరిచి దిశా నిర్దేశం చేసినట్లు తెలిపారు.  జిల్లాలోని  ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గ్రామ పంచాయితీల సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎం.పి.టి.సి, ఎం.పి.పి., జెడ్.పి.టి.సి., మున్సిపాలిటీలలోని కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, చైర్మన్ లు అందరూ  ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం కొనసాగించి కార్యాలయ ఆవరణతొ పాటు, పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారని తెలిపారు. మలేరియా వ్యాధి ఎక్కువగా వచ్చే గ్రామాలలో దోమ

జూలై 4న ప్రారంభం కానున్న బాలానగర్ ఫ్లైఓవర్

Image
 ఏషియన్ మీడియా నెట్వర్క్  చంద్రమోహన్  హైదరాబాద్  కూకట్ పల్లి  జూన్ 19, ఎంతో కాలంగా ఎదురు  చూస్తున్న బాలానగర్ ఫ్లైఓవర్  జూలై 4 వ తేదీన  ...మంత్రి కేటీఆర్   చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు  శనివారం ఫ్లైఓవర్ పనులు పరిశీలించిన అనంతరం విలేకరులకు తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు ఉన్నా ఏ ప్రభుత్వాలు కానీ, ఏనాయకులుకానీపట్టించుకోలేదని.... ఈ ఫ్లై ఓవర్ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్  కృషితో.. ఈనాడు పూర్తి చేసుకున్నామని ఆయన చెప్పారు కేవలం హైదరాబాద్ మహానగరం మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అభివృద్ధి జరుగుతుందని.. ప్రతిపక్షాలు ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని విమర్శలు మాని అభివృద్ధి గురించి మాట్లాడాలని.. కూకట్పల్లి నియోజకవర్గం లో దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణంలు పూర్తి చేసుకున్నామని ఇక ముందు కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా మని అన్నారు... అలాగే త్వరలో  నర్సాపూర్ చౌరస్తా నుంచి ప్రా

ఆంక్షల మినహాయింపుల అనంతరం కూడా కరోనా నియంత్రణకు 5 సూత్రాలను అమలు చేయాలి.

Image
 ఏషియన్ మీడియా నెట్వర్క్  హైద్రాబాద్ జూన్ 19 అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ. పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షల సడలింపుల నేపథ్యంలో సూచనలు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం ఆధారంగా ఆంక్షల విధించడం లేదా సడలింపులు ఇవ్వాలి. ఆంక్షల మినహాయింపుల అనంతరం కూడా కరోనా నియంత్రణకు 5 సూత్రాలను అమలు చేయాలి. టెస్టింగ్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, నిరంతర నిఘా నియమాలను పాటించాలని సూచన. పరీక్షల సంఖ్యను తగ్గించకుండా కొనసాగించాలి. కేసుల సంఖ్య పెరిగినా, పాజిటివిటీ రేటు అధికంగా నమోదైనా ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలి. వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టంను  విచ్ఛిన్నం చేయడం చాలా కీలకం.ఇందుకోసం రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి.పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు జాగ్రత్తగా పునఃప్రారంభించాలని సూచన. ఇందుకోసం జిల్లా, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.

కరోన నిబంధనలు ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కు వర్తించవా...?

Image
  కరోనా నిబంధనలు  సీఎంకు వర్తించవా..?  ...వాసాలమర్రి లో 3000 మందికి సహపంక్తి భోజనాలట...  .... సీఎం కేసీఆర్  భోజనాలు పెడతారట..  ..జాతి మతం భేదం లేకుండా అందరూ రావాలట...   ...అన్ని  ఏర్పాట్లకు అధికారులకు ఆదేశం By: K. Ashok reddy Sr. Journalist,  ఏ ఆర్ మీడియా/ ఏషియన్ మీడియా హైదరాబాద్ జూన్ 19   రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సహపంక్తి భోజనాలు నిర్వహిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉంది  . నియమ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాల్సిన ముఖ్యమంత్రి తానే ఆ నియమాలను ఉల్లంఘించే నిర్ణయాలు తీసుకోవటం విస్మయానికి గురిచేస్తుంది . యాదాద్రి జిల్లా వాసాలమర్రి లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 22న ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ  సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కుల, జాతి, మత బేధాలు లేకుండా అందరితో కలిసి భోజనం కూడా చేస్తారట...  గ్రామంలో ఉన్న 2600 జనాభాతో పాటు చుట్టుపక్కల ఉన్న వారంతా కలుపుకొని దాదాపు 3000 మంది వరకు సహపంక్తి భోజనాలకు అధికార యంత్రాంగం నిమగ్నమై పనిచేస్తోంది. నాకు కూడా కరోనా వచ్చింది : సీఎం కేసీఆర్  ఎప్పటి నుంచో వాసాలమర్రి సందర్శించాలని అనుకుంటున

థర్డ్‌ వేవ్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Image
  ఏషియన్ మీడియా నెట్వర్క్  హైదరాబాద్‌: జూన్ 18 కరోనా థర్డ్‌ వేవ్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని అనవసరంగా ప్రజలను భయపెట్టొద్దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.  దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్లో కోవిడ్ రోగులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 200 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు భారత్‌లో తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.   ఇ  బయోటెక్‌కు వ్యాక్సిన్‌ అడ్వాన్స్‌ కింద రూ.1500 కోట్లు కేటాయించామని తెలిపారు.  దేశంలో ఆక్సిజన్‌ కొరతను 15 రోజుల్లోనే అధిగమించామన్నారు.  తెలంగాణలో 46 ఆస్పత్రులకు 1400 వెంటిలేటర్లు ఇచ్చామన్నారు.  దీపావళికి 80 కోట్ల మందికి అదనంగా 5 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్టు కిషన్‌రెడ్డి వెల్లడించారు.

ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్

Image
 ఏషియన్ మీడియా నెట్వర్క్  న్యూఢిల్లీ: జూన్ 18 తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీలో బిజీ బిజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలుసుకున్న స్టాలిన్ . ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి మొదటిసారిగా ఢిల్లీ వచ్చారు మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రి తో పాటు పలువురు అధికార అనధికార ప్రముఖులు కలుసుకున్నారు శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసానికి వెళ్లి ఆమెను కలుసుకున్నారు ఆమెతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీని కలుసుకొని లు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసింది ముఖ్యంగా గా దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై క్షుణ్ణంగా చర్చించారు అదేవధంగా ప్రస్తుతం దేశంలో నెలకొన్న  కరోన వల్ల ఏర్పడ్డ  విపత్కర పరిస్థితుల పై చర్చించినట్ల తెలిసింది 2024 నాటికి బిజెపికి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఏ విధంగా అడుగులు వేయాలని దానిపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం   ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో ప్రత్యేక సమావేశంలో జరిగినట్లు స్టాలిన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి .  తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు సోనియా గాంధీ స్టాలిన్ ను అభినందించారు జనరంజకమైన పాలనను అందించాలని ఆమె కోరారు కేంద్రం అనుసరి

ఈ దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు బెంబేలెత్తిపోతున్నసామాన్య ప్రజలు

Image
  ఏషియన్ మీడియా నెట్వర్క్  హైదరాబాద్ జూన్ 18   దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెంపు .  శుక్రవారం మరోసారి ధరలు పెంచిన చమురు కంపెనీలు  ఆల్‌టైమ్‌ గరిష్ఠస్థాయికి పెట్రోలియం ధరలు ...లీటర్  105 రూపాయలు.  కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.96.93, డీజిల్‌ రూ.87.69కు పెరిగింది. మరో వైపు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పెట్రోల్‌ రూ.105 మార్క్‌ను దాటింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్‌ ధర రూ.103కి చేరింది.  మరో వైపు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్‌ రూ.108.07 డీజిల్‌ రూ.100.82కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా.. దేశంలో చమురు కంపెనీలు ధరలను పెంచాయి.  ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు 27 సార్లు ధరలు పెరగ్గా.. పెట్రోల్‌పై రూ.6.61, డీజిల్‌ రూ.6.91 పెరిగింది. ఫిబ్రవరి 26న ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగా.. చివరిసారిగా ఫిబ్రవరి 27న ధరలు పెరగ్గా.. ఆ తర్వాత ధరలు పెరుగలేదు. గురువారం అమెరికా మార్కెట్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి..  బ్రెంట్ ముడి బ్యారెల్‌కు 1.31 డాలర్లు తగ్గి 73.08 డాలర్లకు పడిపోయింది. యూఎస్‌ వెస

ఆంధ్రాలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి జగన్

Image
  జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్‌ ఏషియన్ మీడియా నెట్వర్క్  అమరావతి జూన్ 18 : రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే 10,143ఉద్యోగాలనుభర్తీచేయనున్నామని ఏపీ సీఎం జగన్‌ వెల్లడించారు. జాబ్‌ క్యాలెండర్‌ను సీఎం విడుదల చేశారు. మార్చి 2022 వరకు భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారులు, సిఫార్సులు, పైరవీలకు తావు లేకుండా కేవలం మెరిట్‌ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని చెప్పారు .   ‘ ‘ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా శిక్షణ తీసుకుంటున్నారు. వాళ్లు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. ఏ ఉద్యోగం ఏ నెలలో వస్తుందో తెలియజేసేందుకు క్యాలెండర్‌ తీసుకొస్తున్నాం. రెండేళ్లలో ఏకంగా 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశాం. వీటిలో 1,84,264 శాశ్వత ప్రాతిపదికన, 3,99,791 పొరుగు సేవలు, 19,701 ఒప్పంద ఉద్యోగాలు ఇచ్చాం. రూ.3,500 కోట్ల భారం పడుతున్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఇచ్చాం. ఇప్పటికే ఉద్యోగులకు వేతనాలు పెంచాం. రాష్ట్రానికి ఆదాయం తగ్గిన ప్రతికూల పరిస్థితుల్లోనూ సంక్